ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వెర్లను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు
Updated on: 2024-12-18 16:05:00
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాలు మేరకు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్,భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్ల స్వీయ పర్యవేక్షణలో ద్వారకాతిరుమల ఎస్సై తన సిబ్బందితో కలసి సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి ద్వారకాతిరుమల,భీమడోలు, లక్కవరం, తడికలపూడి,టి.నరసాపురం పోలీస్ స్టేషన్లో పరిధిలలో దొంగిలించిన మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగిలించిన ముగ్గురు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.వారు ముగ్గురూ సొంత బావా, బావమరుదులు అయినట్లు,ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి వైర్లను దొంగిలించిన తర్వాత జంగారెడ్డిగూడెంలోని ఉక్కుర్తి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన పాత ఇనుప సామాన్ల కొట్టులో అమ్ముకున్నట్లు నిర్ధారించి,సదరు ఉక్కుర్తి వెంకటేశ్వరరావు వద్ద నుండి సుమారు 539 కేజీల కరిగించబడిన రాగి వైర్ల దిమ్మెలను 100 కేజీల రాగి వైర్లను మొత్తం 639.75 కేజీల రాగిని స్వాధీన పరచుకోని,నిందితుల వద్ద దొంగతనానికి ముందు ఎడ్జ్ ఫీజులను తొలగించుటకు ఉపయోగించే ఇనుప కొక్కెం తోడగబడిన ప్లాస్టిక్ పైపు,రెండు ఇనుప రెంచీలు,నిందుతులు నేరం చేయటానికి వాడిన రెండు బైకులు స్వాదీనపర్చు పరుచుకున్నారు వీటి యొక్క విలువ మొత్తం రాగి విలువ: రూ. 6,39,750 /- అని పోలీసులు తెలిపారు.నేరానికి పాల్పడిన ముగ్గురు ముద్దాయిలతోపాటు రాగివైరుకొన్న పాత ఇనప సామాల కొట్టు యజమానినీ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.