ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Updated on: 2025-01-28 15:36:00
ఎన్టీఆర్ జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం) భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.లక్ష్మీశ తెలిపారు.నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.సీసీ టీవీ కెమెరాలతో గోదాముకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం,వీవీ ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందజేయడం జరుగుతుందని రెవెన్యూ,ఎన్నికలు,పోలీస్ తదితర విభాగాల సమన్వయంతో ఈవీఎం గోదాము వద్ద నిరంతర పర్యవేక్షణతో గట్టి నిఘా పెట్టినట్లు వివరించారు. తనిఖీలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం,కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రమౌళి,ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గోపాల్రెడ్డితో పాటు వై.రామయ్య (టీడీపీ),రాజా(బీజేపీ),ఏసుదాసు (ఐఎన్సీ)తదితరులు పాల్గొన్నారు.