ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కళ్యాణదుర్గం లో జబర్దస్త్ టీం సభ్యుల సందడి
Updated on: 2025-02-08 20:20:00
శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణంలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేయబోతున్నారు. హాస్య భరిత నాటికలు, జబర్దస్త్ జోకులతో పట్టణ వాసులను, భక్తులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాదు నుండి కళ్యాణదుర్గం వచ్చిన జబర్దస్త్ టీం సభ్యులు గడ్డం నవీన్, అప్పారావు, పవన్ తదితరులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. అక్కమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి కళ్యాణదుర్గం చరిత్రను తెలుసుకున్నారు. ఈ రాత్రి 8.30 గంటల నుండి పొద్దుపోయేదాకా స్థానిక దిన మార్కెట్ ఆవరణంలో సందడి చేయబోతున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారనీ, వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు హాస్యనటులు చెప్పారు.