ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
128 కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు : జిల్లా రెవెన్యూ అధికారి మురళి
Updated on: 2025-02-10 18:42:00

నరసరావు పేట, ఫిబ్రవరి 10 జిల్లాలో మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు 128 కేంద్రాల్లో నిర్వహించానున్నామని జిల్లా రెవిన్యూ అధికారి మురళి వెల్లడించారు. రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ విధానంలో కలిపి మొత్తం 26597 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరిలో ఓపెన్ స్కూల్ విధానంలో 1200 మంది రాయనున్నారన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని బీఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలు మరియు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావుకు అప్పగించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక హెల్త్ అసిస్టెంట్ ను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఏ పరీక్షా కేంద్రానికి అయినా చేరుకునే విధంగా కీలక ప్రాంతాల్లో మెడికల్ వ్యాన్లను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ ప్రతినిథులను కోరారు.