ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
128 కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు : జిల్లా రెవెన్యూ అధికారి మురళి
Updated on: 2025-02-10 18:42:00
నరసరావు పేట, ఫిబ్రవరి 10 జిల్లాలో మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు 128 కేంద్రాల్లో నిర్వహించానున్నామని జిల్లా రెవిన్యూ అధికారి మురళి వెల్లడించారు. రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ విధానంలో కలిపి మొత్తం 26597 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరిలో ఓపెన్ స్కూల్ విధానంలో 1200 మంది రాయనున్నారన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని బీఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలు మరియు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావుకు అప్పగించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక హెల్త్ అసిస్టెంట్ ను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఏ పరీక్షా కేంద్రానికి అయినా చేరుకునే విధంగా కీలక ప్రాంతాల్లో మెడికల్ వ్యాన్లను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ ప్రతినిథులను కోరారు.