ముఖ్య సమాచారం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవముల్లో ఎమ్మెల్యే గళ్ళ మాధవి
Updated on: 2025-02-12 22:41:00

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్ మిర్చి యార్డు వద్ద, 44వ డివిజన్ కొరిటేపాడు వాకింగ్ ట్రాక్ వద్ద గల శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవముల్లో ఎమ్మెల్యే గళ్ళ మాధవి పాల్గొని స్వామివారు,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవికి ఘన స్వాగతం పలికి,అర్చకులు ఎమ్మెల్యే మాధవికి వేద ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ... స్వామివారు, అమ్మవార్ల కల్యాణ మహోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆ స్వామి వారు, అమ్మవార్ల కృప మన అందరి పై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలం వెంకటేశ్వర్లు,కదిరి సంజయ్,కన్నసాని బాజి,రాజా, యర్రాకుల శ్రీనివాస్,పవన్ వెంకీ, చెంబెటి మణి కుమారి, తుమ్మల నాగేశ్వరరావు, చంద్రగిరి బాబు తదితరులు పాల్గొన్నారు