ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళ్దాము - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Updated on: 2025-02-13 18:40:00
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో పట్టభద్రుల ఎన్నికలకు ప్రణాళికతో ముందుకు వెళదామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పార్టీ నేతలను కోరారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పరిశీలకులు సింహాద్రి కనకాచారి, కోవెలమూడి రవీంద్రలతో కలిసి కార్పొరేటర్లు, క్లస్టర్, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్సి ఓట్లు అత్యధికముగా ఉన్నాయని, వారందరినీ డోర్ టూ డోర్ కలిసి ప్రచారం చేయటంతో పాటు, ఓటు ఎలా వేయాలన్న దాని మీద అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని మంచి పాలనకు తోడ్పాటునందించాలని కోరుతూ ఓట్లు అభ్యర్ధించాలని సూచించారు. గత ప్రభుత్వం దెబ్బకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని, దీనిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే సత్తా ఎన్డీయే కూటమికి ఉందని, శాసనసభకు అత్యధిక సీట్లు గెలిపించిన మాదిరిగానే, శాసనమండలి అభ్యర్దులను గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఈరంటి వర ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఆడక పద్మావతి, శ్రీవల్లి, మానం శ్రీనివాస్,సుఖవాసి శ్రీనివాస్ రావు, కసుకుర్తి హనుమంతరావు, రావిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.