ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
జిల్లాలీ పఠనోత్సనం
Updated on: 2023-06-26 17:36:00
నిర్మల్ జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమం ప్రారంభం. నిర్మల్ జిల్లాలోని ఆయ పాఠశాలలో పఠణోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భముగా పొరెడ్డి అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంవత్సరం పిల్లల్లో ధారాళంగా చదివే విధంగా, చదివిన దానిని అర్థం చేసుకుని రాసే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధ్నాభ్యాసన సామాగ్రి రూం టు రీడ్ వారు ఇచ్చిన పుస్తకాలను పిల్లలచే చదివించారు. ఉపాధ్యాయులు పిల్లల్ని మూడు గ్రూపులుగా గ్రూపులుగా విభజించి, సామూహిక అభ్యసనం జట్టు అభ్యసనం అదేవిధంగా వ్యక్తిగత అభ్యసనం జరిగే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. పిల్లలందరూ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పీరియడ్ ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న సమయంలో పది నిమిషాలు చదవడానికి పిల్లలతో చదివించడానికి సమయం కేటాయించాలని కోరారు. జట్లుగా చేసి పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా పుస్తకాలను ఇచ్చి చదువుకునేలా చేయాలన్నారు. పిల్లలు ఇంటి వద్ద కూడా గ్రంథాలయ పుస్తకాలను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహేందర్ , రమేష్ బాబు , సురేందర్ , నవిత , రూంటురీడ్ జిల్లా ఇంఛార్జి రవి , కోఆర్డినేటర్ గోవర్ధన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.