ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
రంజాన్ మాసం పురస్కరించుకొని ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ
Updated on: 2025-03-17 12:11:00
రంజాన్ మాసం పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం విద్యానగర్ లో ఆదివారం జరిగింది. టీడీపీ నేత అల్తాఫ్, సాహీర బానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన నెల రమజాన్ నెల అని, క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతన. ఈ మూడింటి కలయికే రంజాన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ నెలల్లో అత్యంత నిష్టతో కఠినమైన ఉపవాసాలు ఆచరిస్తారని, ఈ నెలలో పేదలకు సదఖా పేరుతో సహాయము చేస్తారని, ఇందులో భాగంగా అల్తాఫ్ ముందు వచ్చి ఎంతమందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టటం అభినందనీయమన్ని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మరియు గంటా పెద్దబ్బాయి, మౌళిక, దిలావర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.