ముఖ్య సమాచారం
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
రంజాన్ మాసం పురస్కరించుకొని ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ
Updated on: 2025-03-17 12:11:00

రంజాన్ మాసం పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం విద్యానగర్ లో ఆదివారం జరిగింది. టీడీపీ నేత అల్తాఫ్, సాహీర బానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన నెల రమజాన్ నెల అని, క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతన. ఈ మూడింటి కలయికే రంజాన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ నెలల్లో అత్యంత నిష్టతో కఠినమైన ఉపవాసాలు ఆచరిస్తారని, ఈ నెలలో పేదలకు సదఖా పేరుతో సహాయము చేస్తారని, ఇందులో భాగంగా అల్తాఫ్ ముందు వచ్చి ఎంతమందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టటం అభినందనీయమన్ని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మరియు గంటా పెద్దబ్బాయి, మౌళిక, దిలావర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.