ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
రంజాన్ మాసం పురస్కరించుకొని ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ
Updated on: 2025-03-17 12:11:00
రంజాన్ మాసం పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం విద్యానగర్ లో ఆదివారం జరిగింది. టీడీపీ నేత అల్తాఫ్, సాహీర బానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన నెల రమజాన్ నెల అని, క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతన. ఈ మూడింటి కలయికే రంజాన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ నెలల్లో అత్యంత నిష్టతో కఠినమైన ఉపవాసాలు ఆచరిస్తారని, ఈ నెలలో పేదలకు సదఖా పేరుతో సహాయము చేస్తారని, ఇందులో భాగంగా అల్తాఫ్ ముందు వచ్చి ఎంతమందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టటం అభినందనీయమన్ని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మరియు గంటా పెద్దబ్బాయి, మౌళిక, దిలావర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.