ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
పేట మెడికల్ షాపుల పై ఆపరేషన్ గరుడ...
Updated on: 2025-03-22 08:24:00
అనుమతులు లేని ఔషధాల నిల్వలను భారీగా గుర్తించిన అధికారులు...
దాడుల్లో పాల్గొన్న ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ అధికారులు...
నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటలో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై శుక్రవారం ఈగల్ టీం ఐజి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులోని మెడికల్ షాపులు, బరంపేటలో గల భవ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. భవ్య శ్రీ మెడికల్ గోడౌన్ లో అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఔషధాలు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించి పెద్ద మొత్తంలో మందులు సీజ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిపారు. నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివన్నారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.