ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
కడిపికొండ,మైనారిటీ బాలుల గురుకుల పాఠశాలలో వసతులను తనిఖీ చేసిన హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
Updated on: 2025-03-26 17:12:00
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ పరిధిలో ఉన్న తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలోని వసతులను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు.పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన భోజన పదార్థాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అదేవిధంగా స్టోర్ రూమ్ లో భద్రపరిచిన బియ్యం సంచులు, వంట నూనెలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం , ఇతర ఆహార పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారా అని అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు ఉండాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులకు సూచించారు.