ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ
Updated on: 2025-04-03 19:53:00
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మండల యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో 98 వ జయంతిని పురస్కరించుకొని ఒగ్గు డోలు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ర్యాలీతో వచ్చి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాగం నాగరాజు మాట్లాడుతూ కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడయ్యాడు. 1946 జులై 4 న విసునూర్ రామచంద్రారెడ్డి అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని గుండాలను తరిమికొట్టారు. దొర గుండాల తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, యస్ఐ గణేష్, కోడె శ్రీనివాస్, అధికార ప్రతినిధులు, మండలంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు