ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
శక్తిమంతమైన 'మినిట్మ్యాన్-3'ని పరీక్షించిన యూఎస్.. గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన క్షిపణి!
Updated on: 2025-05-22 12:13:00
అగ్రరాజ్యం అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) 'మినిట్మ్యాన్-3'ను విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాన్డెన్బెర్గ్ స్పేస్ బేస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల (సుమారు 24,000 కిలోమీటర్లు) అసాధారణ వేగంతో 4,200 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యమైన మార్షల్ దీవుల్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి ప్రయాణించిందని అధికారులు వెల్లడించారు.