ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
Updated on: 2025-12-10 08:43:00
బ్రహ్మ కమలం పుష్పాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ పుష్పాలు పూస్తుంటాయి. బ్రహ్మ కమలం పుష్పానికి హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. హిమాలయాల్లో దొరికే ఈ అరుదైన మొక్కను చాలా తక్కువ మంది మాత్రమే పెంచుతుంటారు. అలాగే ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మంచిదని అందరూ భావిస్తుంటారు. అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా బ్రహ్మకమలం ఒకటి పూస్తేనే జనం అద్భుతంగా చూస్తుంటారు. కానీ బొబ్బిలి పట్టణం పూల్ బాగ్ లో నివసిస్తున్న ఏ .లక్ష్మణరావు (విశ్రాంత ఉపాధ్యాయులు) ఇంట్లో పూసిన బ్రహ్మ కమలం పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఒక మొక్క నుంచి ఏకంగా 34 పుష్పాలు విరబూశాయి. లక్ష్మణరావు సంవత్సరం క్రితం ఇతర ప్రాంతం నుంచి ఈ మొక్కను తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ మొక్క నుండి సుమారు 100పైగా బ్రహ్మ కమలం పుష్పాలు విరబూశాయి. చెట్టు నిండా పూసిన పూలు ఆకాశంలో నక్షత్రాలను తలపిస్తున్నాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల జనం తరలివస్తున్నారు. వందకుపైగా పూసిన బ్రహ్మ కమలం పుష్పాలను ఇంటి యజమాని వేంకటేశ్వర స్వామి పూజకు ఉపయోగించారు.