ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
వరితో సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు
Updated on: 2025-05-29 05:58:00
భారతదేశంలోని అన్నదాతలకు గుడ్ న్యూస్... కేంద్రంలోని మోదీ సర్కార్ వరికి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటన చేశారు.
రాబోయే ఖరీఫ్ 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్కు రూ. 69 పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో వరి (సాధారణ రకం) ఎంఎస్పీ క్వింటాల్కు రూ. 2,369కి చేరుకుంది. ఇక, వరి (గ్రేడ్ ఏ) ఎంఎస్పీని కూడా రూ. 69 పెంచడంతో క్వింటాల్ ధర రూ. రూ. 2,389కి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
వరితో పాటు మొత్తం 14 ఖరీఫ్ పంటలకు సవరించిన ఎంఎస్పీలను కూడా కేబినెట్ ఆమోదించింది. అత్యధికంగా నైజర్ సీడ్ క్వింటాలుకు రూ. 820, క్వింటాలు రాగి రూ. 596, క్వింటాల్ పత్తి రూ. 589, క్వింటాల్ నువ్వులు రూ. 579 పెంపునకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.