ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పీఎం కిసాన్ నిధుల విడుదల..
Updated on: 2025-08-02 15:28:00
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని, వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9.7 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లు జమ అయ్యాయి
రైతులకు పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా రూ.6,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తాజా విడుదలతో అన్నదాతలకు వ్యవసాయ పనుల కోసం కీలకమైన పెట్టుబడి సాయం అందినట్లయింది.