ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కేరళను వణికిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా...
Updated on: 2025-09-25 16:31:00
కేరళలో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్(పీఎఏఎం) వ్యాధి ప్రాణాలు తోడేస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ప్రస్తుతం 80 మందికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వారంతా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధిసోకిన వారిలో 97 శాతం డెత్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వరుస కేసులు నమోదు కావడం...21 మంది మృతి చెందడంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు రాష్ట్రంలో అన్ని మైక్రో బయాలజీ ల్యాబ్లలో ఈ వ్యాధిని పరీక్షించే సౌకర్యాలను సైతం అభివృద్ధి చేసింది. అలాగే పీసీఆర్ పరీక్షల ద్వారా అమీబాను గుర్తిస్తున్నట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.