ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
గిరిజనులకు దుస్తులు పంపిణీ చేసిన బొబ్బిలి మాజీ సైనికులు
Updated on: 2025-09-25 22:11:00
బొబ్బిలి మండలంలో గల గిరిజన గ్రామాలైన చినమోసూరువలస , చిలకమ్మ వలస గ్రామాలలో గురువారం బొబ్బిలి మాజీ సైనిక సంఘం గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ పర్యవేక్షణలో గిరిజన గూడెంలో నివసిస్తున్న గిరిజనులను పలకరించి వారికి దుస్తులు, దుప్పట్లు, తువ్వాళ్లు, నిత్యావసరములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు లేక గర్భిణీ మహిళలు డోలిపై వెళ్ళవలసి వస్తుందని, దుర్భరంగా బతుకుతున్నారని వీరికి సహాయపడటం మనందరి కర్తవ్యం అని తెలిపారు. మాజీ సైనికుడు మామిడి ధర్మారావు అక్కడ ఉన్న గర్భిణీ మహిళలకు తమవంతుగా చీర , కొంత ఆర్థిక సహాయం పోషక ఆహారము కోసం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు రెడ్డి రామకృష్ణ , ఎస్ఆర్ మోహన్ రావు, అలుగోలు గోవింద నాయుడు, వి ఎన్ శర్మ, గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి పాల్గొన్నారు.