ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
బొబ్బిలిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ సైనికులు
Updated on: 2025-10-02 10:03:00
గాంధీ జయంతి పురస్కరించుకొని బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం బొబ్బిలి పట్టణం చీపురుపల్లి వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి మాజీ సైనిక సభ్యులు మరియు గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వర్షానికి సైతం లెక్కచేయకుండా తమ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహ ఆవరణలో నందివర్ధనం మొక్కను నాటారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి అనే ఆయన తత్వశాస్త్రంతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి రూపకల్పన చేశారు మహాత్మ గాంధీ అనీ,..ఇప్పటికీ ఈ నినాదంతో ఆయన ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారనీ కొనియాడారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి, మాజీ సైనికులు రెడ్డి రామకృష్ణ, ఎస్ఆర్ మోహన్ రావు, సిహెచ్ మోహన్ రావు, వి.ఎన్ శర్మ, వనమిత్ర కృష్ణ దాసు, తదితరులు పాల్గొన్నారు.