ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బొబ్బిలిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ సైనికులు
Updated on: 2025-10-02 10:03:00
గాంధీ జయంతి పురస్కరించుకొని బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం బొబ్బిలి పట్టణం చీపురుపల్లి వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి మాజీ సైనిక సభ్యులు మరియు గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వర్షానికి సైతం లెక్కచేయకుండా తమ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహ ఆవరణలో నందివర్ధనం మొక్కను నాటారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి అనే ఆయన తత్వశాస్త్రంతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి రూపకల్పన చేశారు మహాత్మ గాంధీ అనీ,..ఇప్పటికీ ఈ నినాదంతో ఆయన ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారనీ కొనియాడారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి, మాజీ సైనికులు రెడ్డి రామకృష్ణ, ఎస్ఆర్ మోహన్ రావు, సిహెచ్ మోహన్ రావు, వి.ఎన్ శర్మ, వనమిత్ర కృష్ణ దాసు, తదితరులు పాల్గొన్నారు.