ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
భారీగా దిగొచ్చిన పసిడి...ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గిన బంగారం
Updated on: 2025-10-23 07:27:00
హైదరాబాద్: రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా కాస్త దిగొస్తున్నాయి. హైదరాబాద్లో బుధవారం పసిడి ధర (Gold Rate) భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.9వేలకు పైగా తగ్గడం గమనార్హం. అటు వెండి ధర కూడా దిగొచ్చింది.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 గ్రాముల మేలిమి 10 గ్రాముల పుత్తడి (Gold) ధర రూ.1,25,250కి పడిపోయింది. 22 క్యారెట్ల ధర రూ.1,14,843గా ఉంది. ఇక వెండి ధర దాదాపు రూ.7వేలు తగ్గింది. నేడు కేజీ వెండి ధర రూ.1,58,000 పలుకుతోంది. వెండి ధర వారం రోజుల్లో దాదాపు రూ.28వేలు తగ్గింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4,022 డాలర్లకు పడిపోయింది. వెండి ధర 47.84 డాలర్లకు చేరింది.
ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరిన బంగారం, వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.