ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు
Updated on: 2025-11-07 11:09:00
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం వందేమాతరం జాతీయ గేయం కార్యక్రమం సి ఐ కే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గేయాన్ని అధికారులు, సిబ్బంది , మాజీ సైనికులు, పాఠశాల విద్యార్థులు సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి కోరిక మేరకు నిర్వహించడం జరిగిందని, దీని విలువను, స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జ్ఞాన ప్రసాద్, పోలీసు సిబ్బంది, బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్, ఎస్సార్ మోహనరావు, జీవీ నాయుడు, ఎం ధర్మారావు, కే టి రావు, పి నారాయణ రావు, పంద్రంగి రవి శ్రీనివాసరావు, వైవి రావు, గెంబలి శ్రీనివాసరావు, వియన్ శర్మ, తదితర సంఘం సభ్యులు, డిఫెన్స్ అకాడమీ కోమటిపల్లి పోటీ పరీక్షల విద్యార్థులు, తాండ్ర పాపారాయ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.