ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
చేయడానికి పనులు ఉండవు, డబ్బుకు విలువ పోతుంది: ఎలాన్ మస్క్
Updated on: 2025-11-20 19:54:00
రాబోయే పది, ఇరవై ఏళ్లలో మనుషులు చేయడానికి పనులేమీ ఉండవని మస్క్ అన్నారు. "భవిష్యత్తులో చాలా పనులు ఆప్షనల్గా మారతాయి. ఇప్పుడు మనం క్రీడలు లేదా వీడియో గేమ్స్ను ఎలా ఆడుతున్నామో, రేపు ఉద్యోగం కూడా అలాగే ఉంటుంది. అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచిని బట్టి పనులు చేసే రోజులు రానున్నాయి" అని వాషింగ్టన్లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో మస్క్ వివరించారు.
ఏఐ, రోబోటిక్స్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తాయని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పేదరికం ఒక సామాజిక సమస్య కాదని, అదొక ఇంజినీరింగ్ సమస్య అని అభివర్ణించారు. "ఏఐ, రోబోటిక్స్ ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. తద్వారా పేదరికం అంతమవుతుంది. ఏఐ, హ్యుమనాయిడ్ రోబోలు అందరినీ ధనవంతులుగా మారుస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. హ్యుమనాయిడ్ రోబోల తయారీలో టెస్లా అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.