ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
గురుజాడ వర్ధంతి సందర్భంగా బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు మొక్కలు నాటారు
Updated on: 2025-11-30 13:31:00
గురజాడ అప్పారావు వర్ధంతి పురస్కరించుకొని బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ..మండలంలోని గున్న తోటవలస గ్రామ శివారున అపార్ట్మెంట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ అప్పారావు... ఆధునిక తెలుగు సాహిత్యానికి, వాడుక భాషకు పునాది వేసిన గొప్ప కవి, రచయిత అని కొనియాడారు. అనంతరం అపార్ట్మెంట్ ఆవరణలో సభ్యులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు మహేష్, వి ఎన్ శర్మ, కృష్ణ దాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.