ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
మాజీ సైనికుల పిల్లలకు మూడు శాతం ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్ కల్పించాలి.
Updated on: 2025-12-01 21:15:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్ ఆధ్వర్యంలో సోమవారం పాతకోటలో గల సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఇటీవల ఎస్బిఐ బొబ్బిలిలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన భోగి ఈశ్వరరావుకు దుస్సాలువతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా రిటైర్డ్ అయిన వారికి భూముల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో మాజీ సైనికుల కోటా కింద రెండు శాతం జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషన్ సీట్ల రిజర్వేషన్లలో ఇప్పుడున్న రెండు శాతానికి మరొక శాతం కోటా పెంచి మాజీ సైనికుల పిల్లలకు ఉన్నత విద్య అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు, ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఏ గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహనరావు, ట్రెజరర్ వి ఎన్ శర్మ, సభ్యులు పాల్గొన్నారు.