ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
అయ్యబాబోయ్ ...సారూ.. నా గుడిసెకు రూ. 3,31,951 కరెంటు బిల్లు ఎట్టా వచ్చిందో కాస్త సెప్పండీ?..నోరు ఎల్ల బెట్టిన ..బాధితుడు
Updated on: 2023-07-11 11:38:00

ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఇంటికి ఏకంగా రూ. మూడున్నర లక్షల కరెంట్ బిల్లు రావడంతో కళ్లు తేలేశాడు. చిన్నపూరి గుడిసెకు అంతపెద్ద మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో లబోదిబో మంటూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలోని పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో రాజుబాబు కుటుంబ సభ్యులందరూ షాక్కు గురయ్యారు. దీనిపై విద్యుత్తు అధికారులను సంప్రదించగా.. సాంకేతిక సమస్య వల్ల పెద్ద మొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు రూ.155 వచ్చిందని తెలియజేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని, రాజుబాబుకి ఎస్సీ రాయితీ ఉండడంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి వివరించారు.