ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి
Updated on: 2023-07-23 09:46:00

భద్రాచలం:రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది.దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.ఉదయం 6 గంటలకు వరద (Floods) ప్రవాహం 43.3 అడుగులకు చేరింది. దీంతో గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇక ఎగువన వర్షాలతో గోదావరి ఉపనది అయిన పెన్గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నది.వరద ఉధృతి పెరగడంతో ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మడలం డొలారా వద్ద నది ఉగ్రరూపం దాల్చింది.50 అడుగుల ఎత్తు ప్రవహిస్తుండటంతో నీరు వంతెన పైనుంచి వెళ్తున్నాయి.దీంతో 44వ నంబర్ జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.