ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల
Updated on: 2023-04-29 21:59:00
చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేల పాలయ్యిందని షర్మిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు.దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలయ్యింది.రైతులు సర్వం కోల్పోయారు ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంత నష్టం జరిగినా కేసీఅర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు గత నెల 23 న కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చాడు.10 వేల సహాయం అంటూ ప్రకటన చేశాడు. నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. గత 9 ఏళ్లుగా దాదాపు 14 వేల కోట్ల పంట నష్టం జరిగింది. ప్రతి ఏటా 1500 కోట్ల నష్టం జరుగుతుంది.ముష్టి రైతు బందు ఇచ్చి కేసీఅర్ రైతును ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. కేసీఅర్ రైతు ద్రోహి ఒక్కో ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు లబో దిబో అంటున్నారు రైతు పరిహారం పై కేసీఅర్ కు అసలు విజన్ లేదు.30 వేలు నష్టం జరిగింది అని చెప్తుంటే 10 వేలు ఏ మూలకు సరిపోతాయి.ఎకరాకు 10 వేలు కాదు వెంటనే 30 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి