ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల
Updated on: 2023-04-29 21:59:00
చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేల పాలయ్యిందని షర్మిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు.దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలయ్యింది.రైతులు సర్వం కోల్పోయారు ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంత నష్టం జరిగినా కేసీఅర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు గత నెల 23 న కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చాడు.10 వేల సహాయం అంటూ ప్రకటన చేశాడు. నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. గత 9 ఏళ్లుగా దాదాపు 14 వేల కోట్ల పంట నష్టం జరిగింది. ప్రతి ఏటా 1500 కోట్ల నష్టం జరుగుతుంది.ముష్టి రైతు బందు ఇచ్చి కేసీఅర్ రైతును ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. కేసీఅర్ రైతు ద్రోహి ఒక్కో ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు లబో దిబో అంటున్నారు రైతు పరిహారం పై కేసీఅర్ కు అసలు విజన్ లేదు.30 వేలు నష్టం జరిగింది అని చెప్తుంటే 10 వేలు ఏ మూలకు సరిపోతాయి.ఎకరాకు 10 వేలు కాదు వెంటనే 30 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి