ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
దేహదారుఢ్య పరీక్షలకు 1136 మంది అభ్యర్థులు హాజరు
Updated on: 2023-09-14 07:43:00
ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న సివిల్ ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ, ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గతనెల 25 నుంచి అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం 1136 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన హాజరు కావాల్సిన అభ్యర్ధులు వర్షకారణంగా వారిని 14వ తేదీన హాజరు కావాలని ఇప్పటికే సూచించారు. చివరి రోజు 15వ తేదీన కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని డీఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన పోలీసు పెరేడ్ గ్రౌండ్ను స్వయంగా పరిశీలించారు. చిన్న చిన్న గుంతలు ఉంటే వాటిలో మట్టి పోయించి చదును చేయించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయనే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకున్నారు.