ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
చంద్రబాబుకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి వైద్య పరీక్షలు
Updated on: 2023-09-22 21:55:00
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అక్కా తమ్ముడు దీక్ష చేపట్టారు. చంద్రబాబు బయటకు వచ్చే వచ్చే వరకూ.... దీక్ష విరమించేది లేదని అఖిల ప్రియ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని అఖిల ప్రియ ఆరోపించారు.
నంద్యాలలో ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగి 30 గంటలు అయిందని, షుగర్ లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెప్పారు.