ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ఎమ్మెల్యే కోరుకంటి మానవత్వం
Updated on: 2023-09-24 06:34:00
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టి రోజు సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి అరుదైన కానుక ఇచ్చారు. మంత్రి కేటీఆర్ జన్మదినం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఇంటిని నిర్మించి ఇచ్చారు. శనివారం వారితో గృహప్రవేశం చేయించారు. అలాగే అంతర్గాం మండలంలోని గోలివాడ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు 30 మందికి ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రామగుండం కార్పొషన్ పరిధి 37వ డివిజన్కు చెందిన నిరుపేద కొండ రాజేశ్వరి నివసించేందుకు ఇల్లులేదు.తన ఇంటి సమీపంలో ఉండే ఆమె దయనీయస్థితిని తెలుసుకున్న చందర్ కొన్ని నెలల కిందట రూ. లక్ష వెచ్చించి ఇంటిని నిర్మించిఇచ్చాడు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా వారితో రిబ్బన్ కట్ చేయించి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తనకు ఇల్లు నిర్మించి ఇచ్చిన కోరుకంటికి మనసారా కృతజ్ఞతలు తెలిపింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నది.