ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పవన్ 'వారాహి' యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం:బాలకృష్ణ
Updated on: 2023-09-30 17:00:00
నంద్యాల:జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన 'వారాహి'యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు.సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు.ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారు అని బాలకృష్ణ ఆరోపించారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే బాలకృష్ణ,యనమల.రామకృష్ణుడు,నక్కా.ఆనంద్బాబు,అశోక్ బాబు,బీద.రవిచంద్ర,నిమ్మల రామానాయుడు,బీసీ జనార్దన్ రెడ్డి,వంగలపూడి.అనిత తదితరులు పాల్గొన్నారు.