ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
స్పందన ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం,ఈ వారం 51 విజ్ఞప్తుల వచ్చాయి:జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
Updated on: 2024-01-19 20:27:00
అల్లూరి జిల్లా పాడేరు:ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,ముందస్తు అనుమతి పొంది మాత్రమె కింది స్థాయి సిబ్బందిని పంపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.శుక్రవారం ఐటిడిఎ సమావేశమందిరంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,ఫిర్యాదుదారుల నుండి 51 విన్నపాలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో అందిన ఫిర్యాదుల పై వెంటనే స్పందించి విచారాణాదికారిని నియమించాలని,సమస్య పరిశ్కారానికి చొరవ చూపి,పరిష్కార చర్యను సంబంధిత ఫిర్యాదుదారునికి తెలియజేయాలని ఆదేశించారు.అదేవిధంగా జగనన్నకు చెబుదాం పోర్టల్ లో అందిన ఫిర్యాదులపై కూడా సకాలంలో స్పందించాలని ఆదేశించారు.కొంతమంది అధికారులు సకాలంలో లాగిన్ అవ్వక పోవటం,సమస్య పరిష్కారం కాకుండా ఐనట్లు అప్లోడ్ చేయడం లాంటివి గుర్తించామని,అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం,26న గణతంత్ర దినోత్సవ వేడుకలలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ కోరారు.22,23 తేదీలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సెల్ టవర్ల ప్రారంభం అవుతుంది అని ఈ నెల 22 లేదా 23 వ తేదీన జిల్లాలో 300 సెల్ టవర్ల ప్రారంభాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్ తెలిపారు.గతంలో హుకుంపేట మండలం భీమవరం,జి.మాడుగుల మండలం సుబ్బులులో ఏర్పాటు చేసిన కార్యక్రమం విజయవంతం చేయడ౦ జరిగిందని గుర్తు చేస్తూ,ఈ నెలలో జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిఒ సూచించారు.ఆ రోజు పాడేరు మండలం ఈదులపాలెం,డు౦బ్రిగుడ మండలం లయగండలో వర్చువల్ ప్రారంబం ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిషేక్ వివరించారు.ఈ స్పందన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.కార్తిక్,సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, డిఆర్ఒ వివి.రమణ అర్జీదారుల నుండి స్పందన విజ్ఞప్తులు స్వీకరించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,ఐటిడిఎ అధికారులు పాల్గొన్నారు.