ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు:హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Updated on: 2024-03-04 13:26:00
పశ్చిమగోదావరిజిల్లా:రాజకీయ జీవితం చివరి చరమాంకం వరకు జనసేనలోనే ఉంటానని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.తనపై వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటా.టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన తనయుడు లోకేష్ల భవిష్యత్తు కోరుకునే కొందరు జనసేన సలహాదారులు నా పనులను సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు.వారు జనసేన గొడుగులో ఉండే కోవర్టులు.ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా నేను చేయాలనుకున్నదే చేస్తాను.నాకు కావాల్సిందల్లా పవన్ రాజకీయ ఎదుగుద అని జోగయ్య స్పష్టం చేశారు.