ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
షాద్ నగర్ లో అరుణమ్మ కు భారీ మెజారిటిని ఇద్దాం
Updated on: 2024-04-08 13:46:00
షాద్ నగర్ లో అరుణమ్మ కు భారీ మెజారిటిని ఇద్దాం ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నిన్న అధికారం రాత్రి కొత్తూరు మండలం గూడూరు, మల్లాపూర్, మల్లాపూర్ తాండ,మక్తగూడ లో బిజెపి ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈయొక్క సమావేశాన్ని ఉద్దేశించి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు,కార్యకర్తలు కలిసి జట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ కు షాద్ నగర్ నియోజకవర్గం నుండి లక్ష కు పైగా ఓట్లను ఇద్దామని బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా సమన్వయం గా పని చేసినప్పుడే అనుకున్నది సాధిస్తామని అన్నారు. ప్రజలు మోదీ కి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున మనం చేయాల్సింది ఒక్కటే ఎన్నికల వరకు ప్రతి ఓటర్ ను నాలుగు అయిదు సార్లు కలవడమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన అవినీతిని,సైనికుల ఊచకోతలను ఉగ్రవాదం ఎలా ఉండేనో ప్రజలకు వివరిస్తూ మోదీ గారు చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి గడప కు తీసుకెళ్లాలని కోరారు. ఈయొక్క కార్యక్రమం లో బిజెపి నాయకులు అత్తాపురం మహేందర్ రెడ్డి, శివలింగం, ఉప్పల రాఘవేందర్, జైపాల్ రెడ్డి, కంచి శేఖర్, గట్టు హరికృష్ణ,డాక్టర్ నర్సింహా నాయక్,విక్రాంత్ గౌడ్, శేఖర్ గౌడ్, వరుణ్ గౌడ్, విక్రమ్ రెడ్డి, రాఘవేంద్ర చారి, శివ దాస్, బాస్కర్ నాయక్, గుండు సాయి, వసంత్, జగదీష్, ఆనంద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.