ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బిజెపి, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వృధా ఇందిరమ్మ రాజ్యం తోనే దేశం సుభిక్షం ఎన్నికల ప్రచారంలో అశ్లేష రెడ్డి
Updated on: 2024-04-30 07:17:00
కేశంపేట: ప్రజా సమస్యలను పట్టించుకోని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే వృధా అవుతుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశి చందర్ రెడ్డి సతీమణి అశ్లేష రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆమె ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సతీమణి అనురాధ, జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి , కాంగ్రెస్ మైనార్టీ నేత యండి.ఇబ్రహీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి దేశంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందఅన్నారు. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ ఒకగూటి పక్షులేనని ఆ పార్టీలకు ఓటు వేసి ఓటును వృధా చేసుకోకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి కి ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని దేశంలో చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదింటిని అమలు చేసినట్లు రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపల ఆ హామీని నెరవేర్చి రైతు ముఖంలో సంతోషాన్ని చూసే సన్నివేశం త్వరలోనే వస్తుందని అన్నారు. నా భర్త వంశీ చంద్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లును కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, పల్లె ఆనంద్ కుమార్, గిరి యాదవ్, కర్ణకార్ రెడ్డి,భాస్కర్ గౌడ్,తుమ్మల గోపాల్, అనసూయమ్మ, సురేష్ రెడ్డి,శశివర్ధన్ రెడ్డి, రావుల పెంటయ్య, రూప్ల నాయక్, ప్రకాష్ ,కోడూరు రాములు, అమెర్,పర్వతాలు, నర్సింలు,శ్రీకాంత్ రెడ్డి,యారం భాస్కర్ రెడ్డి, లాలమొని చంద్రయ్య, శ్రీధర్ , అఖిల్, సల్మాన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.