ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
భర్త గెలుపు కోసం భార్య , కుమార్తె ప్రచారం.
Updated on: 2024-05-06 16:04:00
కూటమి ఉమ్మడి అభ్యర్థి ,బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ను గెలిపించాలని ఆయన సతీమణి త్రివేణి తన కుమార్తె సంస్కృతి తో కలిసి ఈ రోజు బత్తలపల్లి లో ప్రచారం నిర్వహించారు.ఎన్నికల తేదీ సమీస్తున్న తరుణంలో వారు ప్రచార వేగాన్ని పెంచారు.ధర్మవరంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బత్తలపల్లి లో ని ఎంపికచేసిన ప్రాంతాల్లో ఈ రోజు త్రివేణి ప్రచారంలో పాల్గొన్నారు.అమ్మలక్కలను కలిసి సత్యకుమార్ ను గెలిపించాలని కోరారు.ఆయా ప్రాంతాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో హారతులు ఇచ్చి మరి స్వాగతించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని సాగించారు. మహిళలతో కలిసినపుడు ఓటు బిజెపి కే వేస్తామని హామి ఇచ్చారు.అదే సమయంలో అటుగా వచ్చిన పిల్లలతో త్రివేణి ముచ్చటించారు. అనంతరం గోశాలను సందర్శించి గోవులకు గ్రాసం అందించారు.పెద్దవారికి నమస్కరిస్తూ ,పిల్లలను పలకరిస్తూ వారు ప్రచారం నిర్వహించారు.చివరిగా అనంతపురం రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బత్తలపల్లి ఇన్ చార్జి లలిత్ ,కోటి బాబు ,శేషయ్య , సీనియర్ టిడిపి నేత అయ్యప్ప,రాజా రెడ్డి, మల్లేశ్ యాదవ్ ,ములగూరి ప్రసాద్ నాయుడు ,సురేంద్ర నాయుడు, శ్రీమతి అరుణా రవి తదితరులు పాల్గొన్నారు.