ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పాత్రికేయుడు సుబ్బారావుకు అవార్డు రావడం గర్వకారణం
Updated on: 2024-05-31 14:42:00
ప్రముఖ పాత్రికేయుడు పులుసు వీర వెంకట సత్య సుబ్బారావుకు అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీ.హెచ్.పీ.యూ) గౌరవ డాక్టరేట్ భారత కళారత్న అవార్డులు ఇచ్చి గౌరవించడం కొత్తపేట నియోజకవర్గానికే గర్వకారణం అని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో స్వగృహం నందు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా, కవిగా, రచయితగా, నాటక కళాకారుడిగా, పాత్రికేయుడిగా సుబ్బారావు అందరికీ సూపరిచితులు అని, ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం నియోజకవర్గానికే గర్వకారణం అని చిర్ల కొనియాడారు.ఈ మేరకు ఆయన అందుకున్న ధృవ పత్రాలు మెడల్ లను చిర్ల పరిశీలించి సుబ్బారావును దుశ్శాలువాతో సత్కరించారు. సుబ్బారావు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధర్, సీనియర్ పాత్రికేయులు జగతా శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సఖినేటి వాకులరాజు, కొల్లి శ్యాంసన్, బొక్కా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.