ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
పాత్రికేయుడు సుబ్బారావుకు అవార్డు రావడం గర్వకారణం
Updated on: 2024-05-31 14:42:00

ప్రముఖ పాత్రికేయుడు పులుసు వీర వెంకట సత్య సుబ్బారావుకు అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీ.హెచ్.పీ.యూ) గౌరవ డాక్టరేట్ భారత కళారత్న అవార్డులు ఇచ్చి గౌరవించడం కొత్తపేట నియోజకవర్గానికే గర్వకారణం అని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో స్వగృహం నందు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా, కవిగా, రచయితగా, నాటక కళాకారుడిగా, పాత్రికేయుడిగా సుబ్బారావు అందరికీ సూపరిచితులు అని, ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం నియోజకవర్గానికే గర్వకారణం అని చిర్ల కొనియాడారు.ఈ మేరకు ఆయన అందుకున్న ధృవ పత్రాలు మెడల్ లను చిర్ల పరిశీలించి సుబ్బారావును దుశ్శాలువాతో సత్కరించారు. సుబ్బారావు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధర్, సీనియర్ పాత్రికేయులు జగతా శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సఖినేటి వాకులరాజు, కొల్లి శ్యాంసన్, బొక్కా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.