ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
10 నుండి ఇంటర్ సప్లమెంటరీ అనుబంధ పరీక్షలు :డీఐఈఓ
Updated on: 2024-06-08 19:47:00
10న ఆంగ్లం ప్రాక్టికల్స్, 11న పర్యావరణం, 12 నైతిక పరీక్షలు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇంటర్మీడియేట్ కళాశాలల్లో ఈ నెల 10 నుండి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ అనుబంధ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డా. శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలియజేసారు. సంబంధిత పరీక్ష వివరాలు తెలియజేసారు. ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ప్రథమ సం. వార్షిక పరీక్షల్లో గైర్హాజరైన, అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఈ సప్లమెంటరీ పరీక్ష ఉంటుందని ఈ నెల 10న సోమవారం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ సబ్జెక్టుకు, 11 వతేదీ మంగళవారం న పర్యావరణ విద్య, 12 వ తేదీ బుధవారం న నైతిక విలువలు, మానవత పరీక్ష (రెండవ సం. విద్యార్థులకు మాత్రమే) నిర్వహించబడును. ఈ పరీక్షలకు అర్హులైన విద్యార్థుల జాబితాలు సంబంధిత కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని, పరీక్ష నిర్వహించడానికి కావల్సిన సమాధాన పత్రాలు జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంనుండి తీసుకొని బోర్డు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహించి, మూల్యాంకనం అనంతరం ఆన్ లైన్ లో మార్కుల నమోదు చేయాలని అన్నారు. ఈ పరీక్షలకు గాను జిల్లా వ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కు 363 మంది, పర్యావరణ విద్యకు117 , నైతికత, మానవ విలువల పరీక్ష కు 7 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, అన్ని కళాశాలల విద్యార్థులకు సకాలంలో సమాచారాన్ని అందించి పరీక్ష నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.