ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి మొండిచెయ్యి
Updated on: 2025-03-21 20:42:00
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించబడిన నిధులు చాలా అరకొరగా ఉన్నయంటూ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పెంట అంజయ్య పేర్కొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం శోచనీయం అన్నారు. ఈ బడ్జెట్ విద్యావ్యవస్థను చాలా తీవ్ర నిరాశకు గురి చేసినట్టుగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసంగా 15% నిధులు కేటాయిస్తారని అనుకున్నట్లుగా తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 7.57% నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యా రంగం చాలా వెనుకబడి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా విద్యావ్యవస్థ మరింతగా కుంటుపడేలా ఉందన్నారు. అంతేకాకుండా మేధావి వర్గాన్ని తయారు చేసే పరిశ్రమలుగా, కర్మాగారాలుగా భావించబడే యూనివర్సిటీలకి సహితం రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించబడటం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిధులు లేక విలవిలాడే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? అంటూ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థకి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెడుతుందని ఆశించిన విద్యారంగానికి మళ్ళీ మొండి చేయే దక్కిందన్నారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు గత ప్రభుత్వాన్ని అనుసరించనట్లుగా ఉండటం విచారంగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించి విద్యారంగంలో తెలంగాణని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆశించారు. రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి తగిన నిధులు కేటాయించి, విద్యవ్యవస్థ బాగుపడే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.