ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అంతుచిక్కని హృదయ వేదన
Updated on: 2025-07-03 09:17:00
బెంగళూరు (గ్రామీణం) : హాసనతో పాటు ఆయా జిల్లాల్లో చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మరణించిన యువత, మధ్యవయసు వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యుల సమితి భేటీ అయ్యే ప్రక్రియను ప్రారంభమయ్యింది.
జయదేవ ఆసుపత్రి వైద్యాధికారి నేతృత్వంలోని 12 మంది వైద్యులు ఆయా గ్రామాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పొగ తాగడం, మద్యం అలవాటు, ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినడం, కొవ్వు ఎక్కువగా ఉండడంతోనే ఎక్కువ మరణాలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తు, బాధితుల వైద్య నివేదికల ఆధారంగా అంచనాకు వచ్చారు. కొవిడ్ సమయంలో వేసుకున్న టీకాతో మరణాలు సంభవించాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏమీ లేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారి గౌరవ్ గుప్త స్పష్టం చేశారు. బెంగళూరు రూరల్ ప్రాంతంలో గత వారం రోజులుగా గుండెపోటుతో యువకులు, మధ్య వయసు వారు పదుల సంఖ్యలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే