ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అంతుచిక్కని హృదయ వేదన
Updated on: 2025-07-03 09:17:00
బెంగళూరు (గ్రామీణం) : హాసనతో పాటు ఆయా జిల్లాల్లో చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మరణించిన యువత, మధ్యవయసు వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యుల సమితి భేటీ అయ్యే ప్రక్రియను ప్రారంభమయ్యింది.
జయదేవ ఆసుపత్రి వైద్యాధికారి నేతృత్వంలోని 12 మంది వైద్యులు ఆయా గ్రామాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పొగ తాగడం, మద్యం అలవాటు, ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినడం, కొవ్వు ఎక్కువగా ఉండడంతోనే ఎక్కువ మరణాలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తు, బాధితుల వైద్య నివేదికల ఆధారంగా అంచనాకు వచ్చారు. కొవిడ్ సమయంలో వేసుకున్న టీకాతో మరణాలు సంభవించాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏమీ లేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారి గౌరవ్ గుప్త స్పష్టం చేశారు. బెంగళూరు రూరల్ ప్రాంతంలో గత వారం రోజులుగా గుండెపోటుతో యువకులు, మధ్య వయసు వారు పదుల సంఖ్యలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే