ముఖ్య సమాచారం
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
-
రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
Updated on: 2026-02-08 10:33:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ ఆధ్వర్యంలో సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బేబీనాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా మాజీ సైనికులకు ప్రభుత్వ నుంచి జీవో ప్రకారం743/63 ప్రకారం.. 5 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది.... కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేనందున మానవతా దృక్పథంతో వారికి కనీసము 175 గజాల ఇళ్ల స్థలానైనా కేటాయించవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందించారు . అలాగే ఈ సమస్యను రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించవలసిందిగా కోరారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి క్వచ్చన్ అవర్లో సమయం దొరకకపోవచ్చు ..అయినప్పటికీ జీరో అవర్స్ లో మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మరడరామినాయుడు సభ్యులు భోగి ఈశ్వరరావు పి నాగేశ్వరరావు పి అప్పలనాయుడు ఎం లక్ష్మణరావు సిహెచ్ మోహన్ రావు ఎస్వీ రమణమూర్తి సిహెచ్ త్రివేది ఎం శ్రీనివాసరావు గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.