ముఖ్య సమాచారం
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
-
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
-
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
-
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
Updated on: 2026-02-14 14:57:00
2019 లో పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి లో 40 మంది జవాన్లు ఇదే రోజు వీర మరణం పొందారు. దానికి సంతాపంగా శనివారం బ్లాక్ డే పాటిస్తూ బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు పాత కోటలో సంఘము కార్యాలయ ఆవరణలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ మన సంఘం తరపు నుండి అసెంబ్లీలో మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రస్తావించ వలసిందిగా ఎమ్మెల్యే బేబీ నాయనని ఆదివారం 8వ తేదీన కోరిన తరుణంలో ఆయన 11న అసెంబ్లీ మొదలవుగా 13వ తేదీనే.. 2 రోజులలోనే అసెంబ్లీలో మన సమస్యను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు మన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సంఘం సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేసిందన్నారు. దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ సైనికులకు ప్రభుత్వం తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలని వారికి కనీసం 4 నుండి 5 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకే కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు, సభ్యులు పాల్గొన్నారు.