ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
లంచము తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు వీఆర్ఓ వెంకట రమణారెడ్డి
Updated on: 2023-09-14 10:28:00
నంద్యాల జిల్లా మిడుతూరు మండలము జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు.సదరు భూమిని తన పేరు నుండి వారి పేర్లపై ఆన్లైన్ నందు మార్పు చేసి పాసు బుక్కులు ఇవ్వడానికి గాను వీఆర్వో వెంకట రమణా రెడ్డి అనే ఫిర్యాదు ధారుడైన వెంకట రమణయ్య అనే వ్యక్తి నుండి 10000/- రూపాయలు లంచము ఆశించి ముందుగా 3000/- రూపాయలు తీసుకుని మిగిలిన 7000/- రూపాయలు లంచము మిడుతూరు గ్రామంలోని తన ప్రైవేటు కార్యాలయము నందు తీసుకుంటూ ఉండగా బుధవారము నాడు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఈ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తేజేశ్వర్ రావు,వెంకట కృష్ణారెడ్డి,ఇంతియాజ్ అహ్మద్, కృష్ణయ్య,వంశినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలియజేశారు.ప్రజలకు ఏసీబీ డీఎస్పీ విజ్ఞప్తి మీ చట్టబద్దమైన పనిని చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచము ఆశిస్తే ముందుగా 14400 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి గాని 14400 మొబైల్ ఆప్ ద్వారాగాని సమాచారమును అందించగలరు.సదరు లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి కోరారు.