ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
లంచము తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు వీఆర్ఓ వెంకట రమణారెడ్డి
Updated on: 2023-09-14 10:28:00
నంద్యాల జిల్లా మిడుతూరు మండలము జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు.సదరు భూమిని తన పేరు నుండి వారి పేర్లపై ఆన్లైన్ నందు మార్పు చేసి పాసు బుక్కులు ఇవ్వడానికి గాను వీఆర్వో వెంకట రమణా రెడ్డి అనే ఫిర్యాదు ధారుడైన వెంకట రమణయ్య అనే వ్యక్తి నుండి 10000/- రూపాయలు లంచము ఆశించి ముందుగా 3000/- రూపాయలు తీసుకుని మిగిలిన 7000/- రూపాయలు లంచము మిడుతూరు గ్రామంలోని తన ప్రైవేటు కార్యాలయము నందు తీసుకుంటూ ఉండగా బుధవారము నాడు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఈ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తేజేశ్వర్ రావు,వెంకట కృష్ణారెడ్డి,ఇంతియాజ్ అహ్మద్, కృష్ణయ్య,వంశినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలియజేశారు.ప్రజలకు ఏసీబీ డీఎస్పీ విజ్ఞప్తి మీ చట్టబద్దమైన పనిని చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచము ఆశిస్తే ముందుగా 14400 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి గాని 14400 మొబైల్ ఆప్ ద్వారాగాని సమాచారమును అందించగలరు.సదరు లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి కోరారు.