ముఖ్య సమాచారం
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
-
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
-
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
-
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
Updated on: 2026-02-19 16:43:00
ఒడిశాలోని ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి 122 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోనుంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంలోని జగమోహన హాల్ (గర్భగుడి)లో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) చేపట్టింది. ఈ చారిత్రక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు.
1903-04 సంవత్సరంలో బ్రిటిష్ అధికారులు ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఆలయం వెనుక భాగంలోని గోడ బలహీనపడి, పగుళ్లు ఏర్పడటంతో, అది కూలిపోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ హాల్లోకి భక్తులకు గానీ, సందర్శకులకు గానీ ప్రవేశం లేదు.