ముఖ్య సమాచారం
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కేరళలో అత్యవసరంగా దిగిన బ్రిటన్ యుద్ధ విమానం... కారణం ఇదే!
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
-
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
Updated on: 2025-06-15 16:58:00

ముథోల్: నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిని హైదరాబాద్లోని బేగంబజార్కు చెందిన రాకేశ్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలకు ఇక్కడికి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లారు. ఈక్రమంలో అయిదుగురు స్నానం చేస్తూ నీటమునిగి మృతి చెందారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు. సీఐ మల్లేశ్, ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.