ముఖ్య సమాచారం
-
కేటీఆర్ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
-
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
Updated on: 2025-06-16 09:55:00

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఫార్ములా- ఈ కార్ రేసు నిర్వహణ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నేడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆయన హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయినట్టు తెలిసింది. బంజారాహిల్స్లోని నందినగర్లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు