ముఖ్య సమాచారం
-
కేటీఆర్ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
-
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
Updated on: 2025-06-16 10:02:00

అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్స్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద కారణాలను వెలికితీయడంలో ఈ బ్లాక్ బాక్స్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నిన్న కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) లభ్యమైనట్టు చెప్పారు. అంతకుముందు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధికారులు విమానానికి చెందిన ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) మాత్రమే దొరికినట్టు వెల్లడించారు. తాజా పరిణామంతో, రెండు కీలకమైన బ్లాక్ బాక్స్లు (ఎఫ్డీఆర్, సీవీఆర్) దర్యాప్తు బృందాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు పరికరాల ద్వారా విమానం కూలిపోవడానికి గల కారణాలను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.