ముఖ్య సమాచారం
-
మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది: గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
-
కేటీఆర్ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
Updated on: 2025-06-16 17:16:00

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై సోమవారం వెల్లడించారు. దీనికి సంబంధించి తమ దేశ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు.
సామూహిక జనహనన ఆయుధాల తయారీని తమ దేశం మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని బాఘై స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎన్పీటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్పీటీ మాత్రమే కాకుండా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) సభ్యత్వం నుంచి కూడా వైదొలగే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది.
ఇరాన్ అణు కార్యక్రమం 1950వ దశకంలో నాటి పాలకుడు షా రెజా పలావీ హయాంలో అమెరికా సహకారంతో ప్రారంభమైంది. అనంతరం 1958లో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో సభ్యత్వం పొందింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేయగా 1970లో ఆ దేశ చట్టసభ దీనిని ఆమోదించింది. అదే ఏడాది ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం సంతకం చేసిన ఏ దేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయడం, సమకూర్చుకోవడం లేదా బదిలీ చేయడం వంటివి చేయరాదు