ముఖ్య సమాచారం
-
జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఘాటుగా స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ
-
ఇరాన్ పై భారీ ఆపరేషన్ కు అమెరికా సై?
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
Updated on: 2025-06-17 12:21:00

ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. భారతీయులు (Indians) తక్షణమే టెహ్రాన్ (Tehran)ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ (Advisory) జారీ చేసింది. టెహ్రాన్లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్లైన్ను కూడా ఏర్పాటు చేసింది
మరోవైపు టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సూచించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అన్నారు. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.