ముఖ్య సమాచారం
-
జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఘాటుగా స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ
-
ఇరాన్ పై భారీ ఆపరేషన్ కు అమెరికా సై?
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
Updated on: 2025-06-17 12:38:00

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ నుంచి క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉండటంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో లెబనాన్, జోర్డాన్, ఇరాక్ దేశాలు కూడా విమానాల రాకపోకలను నిలిపివేశాయి. దీంతో పశ్చిమాసియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూతపడగా.. సుమారు 10,000 మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారని విమానయాన భద్రతా నిపుణుడు, రిటైర్డ్ పైలట్ జాన్ కాక్స్ తెలిపారు.
టెహ్రాన్ శివార్లలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఖొమేనీలో అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇజ్రాయెల్ కూడా తమ దేశంలోని కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. ఈ పరిణామాల వల్ల సుమారు 50,000 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం.