ముఖ్య సమాచారం
-
జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఘాటుగా స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ
-
ఇరాన్ పై భారీ ఆపరేషన్ కు అమెరికా సై?
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
Updated on: 2025-06-17 12:42:00

ఇజ్రాయెల్లో చైనా పౌరులకు అలెర్ట్
జోర్డాన్ మీదుగా భూమార్గంలో వెళ్లాలని చైనా రాయబార కార్యాలయం ప్రకటన
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు పాల్పడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ దాడుల వల్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా గణనీయంగా జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ పౌరులు తక్షణమే ఇజ్రాయెల్ విడిచి వెళ్లాలని అక్కడి చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వాయు మార్గం మూసివేయబడినందున, చైనా పౌరులు జోర్డాన్ వైపు ఉన్న భూ సరిహద్దుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. పౌరుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.